Saturday, December 26, 2009

అందుకే అంత మాధుర్యం

అక్బరు చక్రవర్తి ఓ రోజు ఉదయం వాహ్యాలికీ బైలుదేరాడు, తనకి తెలీకుండానే చాలా దూరం సాగిపోయాడు. అంతలో ఒక చక్కని పాట అతని చెవినపడింది, మంత్రించినట్టు అలా నిలబడిపోయాడు. చుట్టూ చూసేసరికి దూరంగా ఒక హరిదాసు తన్మయుడై అర్థనిమిలిత నేత్రాలతో గానం చేస్తూ కనపడ్డాడు. అక్బరుకు చాల ఆశ్చర్యం కలిగింది, తను ఎప్పుడు అంత మధురమైన గానం వినలేదు.
రాజ భవనానికి చేరగానే తన ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ కు కబురు చేసి రప్పించి " మీరూ గొప్ప గాయకులే కదా , అంత కదిలించే పాట ఎప్పుడూ ఎందుకు పాడలేదు?" అని తను విన్న గానం గురించి చెప్పాక అడిగాడు అక్బరు. అప్పుడు తాన్ సేన్ నిట్టూర్చి " ఏముంది ప్రభూ నేను మిమ్మల్ని రంజింపచేయడానికి పాడతాను ఆ హరిదాసు భగవంతుని రంజింపచేయడానికి పాడుతున్నాడు, అందుకే అతని పాటకు అంత మాధుర్యం" అన్నాడు.

ఆగస్టు 2003 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

5 comments:

శివ చెరువు said...

Satyame kadaaa... bhagavath smaranalo... aa madhuryam maha goppaga untundi.

రవిచంద్ర said...

చాలా మంచి విషయం జ్ఞప్తికి తెచ్చారు. నేను కూడా చదివాను. ఇక్కడ అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

Aditya Madhav Nayani said...

nice one

sravya said...

bagundi, manchi vishayalu cheputunnaru bloglo

హను said...

nijamea baghavamtuni gaanamloa amRtam nimDi vumTumdi amdukea aa madhuryam