Wednesday, December 16, 2009

అర్థం చేసుకోండి!

కొన్ని మంచి పుస్తకాలలోని కథలను ఈ కథా సుధ సంకలనం నందు పెడుతున్నాను, ఇవి ఒకదాని తర్వాత ఒకటి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనె వివిధ భాగాలుగా ప్రచురిస్తున్నాను.
ధన్యవాదములు

పూర్వం ఒక పండితుడు ఉండేవాడు.ఎంతటి క్లిష్టమైన గ్రంధాన్నైన తేలికగా అర్థమయ్యేలా వివరించే శక్తితో పాటు అతనికి మంచి మాటకారితనం కూడా ఉండేది, స్వదేశంలో గొప్ప ఐశ్వర్యం గడించినా ఆ పండితునికి ధనం పై ఆశ చావక పొరుగు రాజ్యానికి వెళ్ళి రాజాశ్రయం సంపాదించి రాజుగారికి భగవధ్గీతను బోదించడం ప్రారంబించాడు. ప్రతి రోజూ తన బోధన పూర్తయ్యాక "అర్థమైందా రాజా?" అని అడిగేవాడు. "ముందు మీరు అర్ఠం చేసుకుని చెప్పండి" అనేవాడు రాజు. ఇలా కొంత కాలం గడిచింది. రాజు ప్రతిరోజు అలాగే అంటుందేసరికి ఆ పండితునికి తన పాండిత్యం మీద తనకే అనుమానం కలగడం ప్రారంభించింది, తను సంపదించిన ఐశ్వర్యం చాలక మరింత ఐశ్వర్యం కోసం ప్రాకులాడుతున్నానని, భగవద్గీత బొదిస్తున్నది అది కానే కాదని అప్పుడతనికి స్పురించింది. "మహా రాజ మీ దయ వల్ల నాకు భగవద్గీత అర్థమైంది, ఇక సెలవు !" అని రాజుకు చెప్పి అక్కది నుంది స్వదేశానికి నిష్క్రమించాడు పండితుడు.

2002 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది ఈ కథ .

2 comments:

kavita said...

మీ ప్రయత్నం అభినందనీయం

Anonymous said...

nice one