Showing posts with label కథాసుధ సంకలనం. Show all posts
Showing posts with label కథాసుధ సంకలనం. Show all posts

Wednesday, January 13, 2010

దేవుడెలా కనిపిస్తాడు?


"భగవంతుని దర్శించే మార్గం చెప్పండి స్వామీ " అని అడిగాడు ఒక శిష్యుడు గురువుగారిని.
గురువు అతణ్ని ఒక చెరువులోకి దింపి అతని తలను నీళ్ళలో అదిమి పెట్టి కాసేపు ఉంచాడు.
తర్వాత తల పైకి ఎత్తిన శిష్యుని "ఎలా ఉంది? " అని అడిగాడు.
" ఊపిరాడలేదు స్వామి, చనిపోతాననిపించింది. "అన్నాడు శిష్యుడు.
" నువ్వు ఊపిరి తీసుకోవడానికి ఎంత తపించావో, భగవంతుని దర్శనం కోసం అంత తపించు! అప్పుడు కనిపిస్తాడు " అన్నాడు గురువు.

జూలై 2003 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది. ధన్యవాదములు

Wednesday, January 6, 2010

తమ దగ్గర ఉన్నదే ఇస్తారు!

జీసస్ కొందరితో కలసి ఒకసారి దారిన వెళుతుండగా కొంతమంది ఆయన గురించి చెడుగా చెప్పుకుంటుండడం వినిపించింది. జీసస్ ముఖంలో ఎటువంటి బాధా కనిపించలేదు. పైగా ప్రేమపూర్వక ధరహాసం చిందిస్తూ వారి గురించి తనతో ఉన్న వారితో కొన్ని మంచి మాటలు చెప్పారు.

జీసస్ వైఖరి వారికి అర్థంకాలేదు ."అదేమిటి ప్రభూ! వాళ్ళు మీ గురించి చెడ్డగా మాత్లాడుటుంటే మీరు వారి గురించి మంచిగా చెబుతారేమిటి?" అని ప్రశ్నించారు.
"దానికేముంది! ఎవరైనా తమ దగ్గర ఉన్నదే ఇతరులకి ఇస్తారు" అన్నారు జీసస్.

నవంబర్ 2002 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Saturday, December 26, 2009

అందుకే అంత మాధుర్యం

అక్బరు చక్రవర్తి ఓ రోజు ఉదయం వాహ్యాలికీ బైలుదేరాడు, తనకి తెలీకుండానే చాలా దూరం సాగిపోయాడు. అంతలో ఒక చక్కని పాట అతని చెవినపడింది, మంత్రించినట్టు అలా నిలబడిపోయాడు. చుట్టూ చూసేసరికి దూరంగా ఒక హరిదాసు తన్మయుడై అర్థనిమిలిత నేత్రాలతో గానం చేస్తూ కనపడ్డాడు. అక్బరుకు చాల ఆశ్చర్యం కలిగింది, తను ఎప్పుడు అంత మధురమైన గానం వినలేదు.
రాజ భవనానికి చేరగానే తన ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ కు కబురు చేసి రప్పించి " మీరూ గొప్ప గాయకులే కదా , అంత కదిలించే పాట ఎప్పుడూ ఎందుకు పాడలేదు?" అని తను విన్న గానం గురించి చెప్పాక అడిగాడు అక్బరు. అప్పుడు తాన్ సేన్ నిట్టూర్చి " ఏముంది ప్రభూ నేను మిమ్మల్ని రంజింపచేయడానికి పాడతాను ఆ హరిదాసు భగవంతుని రంజింపచేయడానికి పాడుతున్నాడు, అందుకే అతని పాటకు అంత మాధుర్యం" అన్నాడు.

ఆగస్టు 2003 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Wednesday, December 16, 2009

అర్థం చేసుకోండి!

కొన్ని మంచి పుస్తకాలలోని కథలను ఈ కథా సుధ సంకలనం నందు పెడుతున్నాను, ఇవి ఒకదాని తర్వాత ఒకటి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనె వివిధ భాగాలుగా ప్రచురిస్తున్నాను.
ధన్యవాదములు

పూర్వం ఒక పండితుడు ఉండేవాడు.ఎంతటి క్లిష్టమైన గ్రంధాన్నైన తేలికగా అర్థమయ్యేలా వివరించే శక్తితో పాటు అతనికి మంచి మాటకారితనం కూడా ఉండేది, స్వదేశంలో గొప్ప ఐశ్వర్యం గడించినా ఆ పండితునికి ధనం పై ఆశ చావక పొరుగు రాజ్యానికి వెళ్ళి రాజాశ్రయం సంపాదించి రాజుగారికి భగవధ్గీతను బోదించడం ప్రారంబించాడు. ప్రతి రోజూ తన బోధన పూర్తయ్యాక "అర్థమైందా రాజా?" అని అడిగేవాడు. "ముందు మీరు అర్ఠం చేసుకుని చెప్పండి" అనేవాడు రాజు. ఇలా కొంత కాలం గడిచింది. రాజు ప్రతిరోజు అలాగే అంటుందేసరికి ఆ పండితునికి తన పాండిత్యం మీద తనకే అనుమానం కలగడం ప్రారంభించింది, తను సంపదించిన ఐశ్వర్యం చాలక మరింత ఐశ్వర్యం కోసం ప్రాకులాడుతున్నానని, భగవద్గీత బొదిస్తున్నది అది కానే కాదని అప్పుడతనికి స్పురించింది. "మహా రాజ మీ దయ వల్ల నాకు భగవద్గీత అర్థమైంది, ఇక సెలవు !" అని రాజుకు చెప్పి అక్కది నుంది స్వదేశానికి నిష్క్రమించాడు పండితుడు.

2002 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది ఈ కథ .