Saturday, December 26, 2009

అందుకే అంత మాధుర్యం

అక్బరు చక్రవర్తి ఓ రోజు ఉదయం వాహ్యాలికీ బైలుదేరాడు, తనకి తెలీకుండానే చాలా దూరం సాగిపోయాడు. అంతలో ఒక చక్కని పాట అతని చెవినపడింది, మంత్రించినట్టు అలా నిలబడిపోయాడు. చుట్టూ చూసేసరికి దూరంగా ఒక హరిదాసు తన్మయుడై అర్థనిమిలిత నేత్రాలతో గానం చేస్తూ కనపడ్డాడు. అక్బరుకు చాల ఆశ్చర్యం కలిగింది, తను ఎప్పుడు అంత మధురమైన గానం వినలేదు.
రాజ భవనానికి చేరగానే తన ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ కు కబురు చేసి రప్పించి " మీరూ గొప్ప గాయకులే కదా , అంత కదిలించే పాట ఎప్పుడూ ఎందుకు పాడలేదు?" అని తను విన్న గానం గురించి చెప్పాక అడిగాడు అక్బరు. అప్పుడు తాన్ సేన్ నిట్టూర్చి " ఏముంది ప్రభూ నేను మిమ్మల్ని రంజింపచేయడానికి పాడతాను ఆ హరిదాసు భగవంతుని రంజింపచేయడానికి పాడుతున్నాడు, అందుకే అతని పాటకు అంత మాధుర్యం" అన్నాడు.

ఆగస్టు 2003 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Monday, December 21, 2009

సాగరం..


ఎక్కడెక్కడో పర్వతాల్లొ పుట్టి
బుడి బుడి అడుగులతో
త్రోవలో తోటి వారిని కలుపుకొని
నవ్వుతూ పరవళ్ళు తొక్కుతూ
నడచిన త్రోవంతా నందనవనం చేస్తూ
తనకై వస్తున్న రాకుమారిని
అలల బాహువులతో ఆహ్వానించే
రాకుమారునిలా ఉంది సాగరం..


ఒకరి పొడ వేరొకరికి గిట్టకపోయినా
మొహాన చిరునవ్వు పులుముకున్న జనాలు,
కులమతాల రాగద్వేషాల చాందసభావాల
విప్లవాలు వినోదాలు కలగలిపిన
లౌకిక రాజ్యంలా ఉంది సాగరం..

Saturday, December 19, 2009

తారక మంత్రం

రామ అనే రెండక్షరాలే తారక మంత్రం, ఆ రెండక్షరాలలోనే విశ్వరహస్యమంతా దాగుంది. సృష్టి స్థితి లయాలనే మూడింటికి ఉన్న సంబంధమే రామ శబ్ధం.

రామ శబ్ధంలోని "రా" లో "ర + ఆ" అనే అక్షరాలు ఉన్నాయి, ఇందులో "ర" అంటే అగ్ని, "ఆ" అంటె సూర్యుడు, "మ" అంటే చంద్రుడు. రామ శబ్ధంలో విశ్వానికి మూలమైన ఈ మూడు శక్తులు ఉన్నాయన్నమాట.

సూర్యుడు, భూమి, కాంతి, చలనము, విద్యుత్తు, ధ్వని, మేధస్సు, అగ్ని వలననే అవతరించాయని సామవేదంలో పేర్కొనబడినది.ఇక సూర్యుడి వల్లనే జ్ఞాన విజ్ఞానాలు లభిస్తున్నాయి, ప్రాణులకు చైతన్యం కలిగించేది సూర్యుడే. చంద్రుదు చల్లని వాడు, ఉష్ణొగ్రత తగినంత ఉండకపోతే ప్రాణులు జీవించలేవు, అందుకే చంద్రుడు లయానికి దోహదం చేస్తాడు. అందుకే రామ శబ్ధం తారక మంత్రమైంది, అందులో ఇంత విశెషముంది.

కుముదం 'భక్తి ' మాస పత్రిక (ఏప్రిల్ 2003) నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Friday, December 18, 2009

అమృతవాణి - I


చతుర్విధ పురుషార్థములు
"ధర్మార్థకామమోక్షాలు"

1. ధర్మము: ధర్మము ఆచరించాలి, మనం చేయగలిగిన దానిని సన్మార్గంలో చేయడమే ధర్మం.
జీవనానికి అవసరమైన ధర్మమార్గమున సంపాదించాలి

2. అర్థము: సన్మార్గమున అర్థవంతముగ జీవించాలి, కోరికలను విదిచిపెట్టాలి.

3. కామము: మోహమును జయించాలి అందుకు మనసున మంచి కోరికలు ఉండాలి.

4. మోక్షము: పైవన్ని చేసినపుదు మోక్షము లభిస్తుంది అని పెద్దల ఉవాచ.

ఈ నాలుగు మానవ జీవిత రధమునకు నాలుగు చక్రాలు.


కుముదం 'భక్తి ' మాస పత్రిక (ఏప్రిల్ 2007) నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Wednesday, December 16, 2009

అర్థం చేసుకోండి!

కొన్ని మంచి పుస్తకాలలోని కథలను ఈ కథా సుధ సంకలనం నందు పెడుతున్నాను, ఇవి ఒకదాని తర్వాత ఒకటి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనె వివిధ భాగాలుగా ప్రచురిస్తున్నాను.
ధన్యవాదములు

పూర్వం ఒక పండితుడు ఉండేవాడు.ఎంతటి క్లిష్టమైన గ్రంధాన్నైన తేలికగా అర్థమయ్యేలా వివరించే శక్తితో పాటు అతనికి మంచి మాటకారితనం కూడా ఉండేది, స్వదేశంలో గొప్ప ఐశ్వర్యం గడించినా ఆ పండితునికి ధనం పై ఆశ చావక పొరుగు రాజ్యానికి వెళ్ళి రాజాశ్రయం సంపాదించి రాజుగారికి భగవధ్గీతను బోదించడం ప్రారంబించాడు. ప్రతి రోజూ తన బోధన పూర్తయ్యాక "అర్థమైందా రాజా?" అని అడిగేవాడు. "ముందు మీరు అర్ఠం చేసుకుని చెప్పండి" అనేవాడు రాజు. ఇలా కొంత కాలం గడిచింది. రాజు ప్రతిరోజు అలాగే అంటుందేసరికి ఆ పండితునికి తన పాండిత్యం మీద తనకే అనుమానం కలగడం ప్రారంభించింది, తను సంపదించిన ఐశ్వర్యం చాలక మరింత ఐశ్వర్యం కోసం ప్రాకులాడుతున్నానని, భగవద్గీత బొదిస్తున్నది అది కానే కాదని అప్పుడతనికి స్పురించింది. "మహా రాజ మీ దయ వల్ల నాకు భగవద్గీత అర్థమైంది, ఇక సెలవు !" అని రాజుకు చెప్పి అక్కది నుంది స్వదేశానికి నిష్క్రమించాడు పండితుడు.

2002 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది ఈ కథ .